ఖమ్మం, సెప్టెంబర్ 18: ఖమ్మం నగర పాలక సంస్థ కమిషనర్గా ఐఏఎస్ అధికారి ఆదర్శ్ సురభి నియమితులయ్యారు ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశకుమార్ శుక్రవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదర్శ్ సురభి ప్రస్తుతం ములుగు జిల్లా అదనపు కలెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆయన గతంలో ట్రైనీ కలెక్టర్గా ఖమ్మంలో సుమారు ఏడాదిపాటు పనిచేశారు. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లో దాదాపు రెండేళ్లపాటు కమిషనర్గా పనిచేసిన అనురాగ్ జయంతి గత నెల 30న రాజన్న సిరిసిల్ల కలెక్టర్గా బదిలీ అయ్యారు. తరువాత అదనపు కలెక్టర్ స్నేహలత మొగిలి కేఎంసీ ఇన్చార్జి కమిషనర్గా ఈ నెల 2న బాధ్యతలు చేపట్టారు. నూతనంగా నియమితులైన ఆదర్శ్ సురభి సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు.