భద్రాచలం, ఏఫ్రిల్ 18: భద్రాద్రి ఆలయంలో ఈ నెల 21న శ్రీరామనవమి, 22న పట్టాభిషేకం మహోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం భద్రాచలం సబ్కలెక్టర్ కార్యాలయంలో డివిజన్స్థాయి అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొద్దిమంది సమక్షంలోనే ఉత్సవాలు నిర్వహించాలన్నారు. గోదావరిలో నీటిమట్టం లోతు తెలిపే హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సరఫరాకు అంతరాయం కలుగకుండా చూడాలన్నారు. ఉత్సవాలకు అతిథుల కోసం ఆలయ ఆవరణలో శానిటైజర్లు, మాస్కులు సిద్ధంగా ఉంచాలన్నారు. ఏఎస్పీ వినీత్ మాట్లాడుతూ.. ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలన్నారు. పట్టణంలో ట్రాఫిక్కు అంతరాయం ఉండకుండా చూడాలన్నారు. సమావేశంలో ఆలయ ఈవో బానోత్ శివాజీ, తహసీల్దారు శ్రీనివాస్యాదవ్, పట్టణ సీఐ స్వామి పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
IPL 2021: పంజాబ్తో మ్యాచ్.. ఢిల్లీ జట్టులోకి స్టీవ్ స్మిత్
ఏపీలో కరోనా విజృంభన.. ఒక్కరోజే 22 మంది మృతి