ఏపీ నుంచి భద్రాద్రి ఆలయానికి చేరుకున్న భక్తబృందం
భక్తి శ్రద్ధలతోతలంబ్రాల సమర్పణ
భద్రాచలం, ఏప్రిల్ 18: ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా కోరుకొండకు చెందిన శ్రీకృష్ణచైతన్య సంఘం సభ్యుడు కల్యాణం అప్పారావు ఆధ్వర్యంలో ఆదివారం భక్త బృందం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవాల కోసం గోటితో ఒలిచిన రెండున్నర క్వింటాళ్ల గోటి తలంబ్రాలను తీసుకువచ్చారు. ఆలయ ఈవో బానోత్ శివాజీ సమక్షంలో తలంబ్రాలను అందజేశారు.
శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి ఆధ్వర్యంలో..
ఏపీలోని జంగారెడ్డిగూడేనికి చెందిన శ్రీరామ ఆధ్యాత్మిక సేవా సమితి సభ్యులు గోటితో ఒలిచిన తలంబ్రాలను ఆదివారం పాదయాత్రగా భద్రాద్రి రామయ్య సన్నిధికి చేరుకుని దేవస్థాన ఈవో బానోత్ శివాజీకి అందజేశారు.
ఇవి కూడా చదవండి
సముద్రంలో విమానం అత్యవసర ల్యాండింగ్.. వీడియో వైరల్
టీకా పంపిణీ విజయవంతం.. ఇకపై మాస్కులు అక్కర్లేదు..!