ఖమ్మం/కమాన్బజార్/ఖమ్మం సిటీ/మామిళ్లగూడెం/రఘునాథపాలెం/ఖమ్మం రూరల్, ఏప్రిల్ 17 : కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా రెండవ రోజు ప్రధాన పార్టీతో పాటు వివిధ పార్టీలకు చెందిన అభ్యర్థులు శనివారం నామినేషన్లు దాఖలు చేశారు. 29వ డివిజన్లో టీఆర్ఎస్ కార్యాలయం ఇంచార్జీ ఆర్జేసీ కృష్ణ, టీఆర్ఎస్ తరపున అభ్యర్థి పత్తిపాక లత విజయాన్ని కాంక్షిస్తూ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యర్రా అప్పారావు, సతీశ్, పత్తిపాక రమేశ్ పాల్గొన్నారు. 33వ డివిజన్ టీఆర్ఎస్ తరపున తోట ఉమారాణి, 27వ డివిజన్ నుంచి పాలడుగు పాపారావు, 28వ డివిజన్ నుంచి గజ్జల లక్ష్మి, 34వ డివిజన్ నుంచి రుద్రగాని శ్రీదేవి , 35వ డివిజన్ నుంచి బోజెడ్ల రాంమోహన్ , 36వ డివిజన్ నుంచి పసుమర్తి రాంమోహన్రావు, 46వ డివిజన్ టీఆర్ఎస్ తరపున కన్నం వైస్ణవి, 47వ డివిజన్ నుంచి అభ్యర్థినిగా మాటేటి అరుణ, 48వ డివిజన్ నుంచి తోట గోవిందమ్మ, 17వ డివిజన్ నుంచి మందడపు షర్మిల, 2వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున నర్రా ఎల్లయ్య, 8వ డివిజన్ నుంచి టీఆర్ఎస్ తరపున ఆర్ఎంపీ డాక్టర్ మోహన్ నామినేషన్, 7వ డివిజన్ టీఆర్ఎస్ తరపున లింగనబోయిన లక్ష్మణ్, 59వ డివిజన్కు టీఆర్ఎస్ తరపున బట్టపోతుల లలితారాణి, బట్టపోతుల అనూష, జంగం కల్పన తమ నామినేషన్లను అధికారులకు అందజేశారు.
10డివిజన్ నుంచి చావా మధవి, 11 డివిజన్ నుంచి సరిపూడి సరిత, 13 డివిజన్ నుంచి కొత్తపల్లి నీరజ,14 డివిజన్ నుంచి కూరాకుల వలరాజు, 15 డివిజన్ నుంచి రావూరి కరుణ శనివారం నగరంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల్లో వారి నామినేషన్లను రిటర్నింగ్ అధికారులకు అందించారు. 18వ డివిజన్ నుంచి మందడపు లక్ష్మి, 20వ డివిజన్ నుంచి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సతీమణి పువ్వాడ వసంత లక్ష్మి, 21వ డివిజన్ నుంచి బిక్కసాని ప్రశాంతలక్ష్మి, 23వ డివిజన్ నుంచి ఎస్కే మగ్బూల్, 24 వ డివిజన్ నుంచి కమర్తపు మురళి, 25వ డివిజన్ నుంచి గోళ్ల చంద్రకళ, 26వ డివిజన్ నుంచి పునుకొళ్లు నీరజ టీఆర్ఎస్ తరపున నామినేషన్లు దాఖలు చేశారు.
38వ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ ఎండీ షౌకత్అలీ సతీమణి ఎండీ ఆలియా, 39వ డివిజన్ నుంచి దౌలె లక్ష్మిప్రసన్న, మడూరి ప్రసాద్, 40వ డివిజన్ నుంచి మాజీ కార్పొరేటర్ దాదె ధనలక్ష్మి కుటుంబానికి చెందిన దాదె అమృతమ్మ, 41వ డివిజన్ నుంచి కర్నాటి కృష్ణమూర్తి, 42వ డివిజన్ నుంచి పాకాలపాటి విజయనిర్మల, 44వ డివిజన్ నుంచి పాలెపు విజయలక్ష్మి , 45వ డివిజన్ నుంచి మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బుడిగెం శ్రీనివాసరావు టీఆర్ఎస్ తరపున నామినేషన్లు వేశారు. ఆయా ప్రక్రియను ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ దగ్గరుండి పర్యవేక్షించారు. కాగా..! నామినేషన్ల ప్రక్రియ సందర్భంగా అధికార పార్టీ అభ్యర్థులు తమ మద్దతుదారులతో భారీగా తరలిరావడంతో జిల్లా పరిషత్, నగరపాలకసంస్థ, డీఆర్డీఏ, వ్యవసాయశాఖ కార్యాలయాల దగ్గర సందడి నెలకొంది.
ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం కరోనా సెకెండ్ వేవ్ ఉధృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని కేంద్రాల వద్ద శానిటైజర్లను ఏర్పాటు చేసింది. అభ్యర్థులతోపాటు వారి మద్దతుదారులకు శానిటైజ్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతించారు.ఇతర పార్టీలకు చెందిన వారు 59వ డివిజన్లో బీజేపీ తరపున దోరేపల్లి సువర్ణ, కాంగ్రెస్ తరపున కోర్ని దేవి, 60వ డివిజన్లో బీజేపీ తరపున జంగం ప్రవీణ్ నామినేషన్ల దాఖలు చేశారు.
ర్యాలీలతో గులాబీ జోష్…
ఖమ్మ నగరం, పాలేరు నియోజకవర్గంలోని దానవాయిగూడెం, రామన్నపేట డివిజన్ల నుంచి టీఆర్ఎస్ తరపున అభ్యర్థులు ర్యాలీలతో తరలివచ్చారు. టీఆర్ఎస్ జెండాలు, డప్పులు, పటాకుల మోతతో ముందుకు సాగారు. డివిజన్ల నుంచి నేతలు, కార్యకర్తలతో కలిసి ర్యాలీగా వందలాదిగా కార్యకర్తలు తరలిరావడంతో టీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ కనిపించింది.