చండ్రుగొండ, ఏప్రిల్12: మామిడి కోతలు ప్రారంభమయ్యాయి. చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పెనుబల్లి , సత్తుపల్లి, అశ్వరావుపేట మండలాల్లో మామిడితోటలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు. వాతావరణం గత ఏడాది కంటే ఈసారి అనుకూలంగా ఉండడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. హైదారాబాద్, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు స్థానికంగా ప్రైవేటు మార్కెట్ను ఏర్పాటు చేసుకొని రైతుల వద్ద నుంచి మామిడికాయాల్ని కొనుగోలు చేసి, కాయల్ని గ్రేడింగ్ చేస్తారు. అనంతరం వాటిని ప్లాస్టిక్ ట్రేలల్లో ప్యాకింగ్ చేసి, లారీల్లో ఢిల్లీ, హైదరాబాద్, విజయవాడ ఇతర పట్టణాలు,నగరాలకు తరలిస్తారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధానంగా అశ్వారావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లోనే అధికంగా రైతులు మామిడి పండిస్తున్నారు. రైతుల వద్ద నుంచి వ్యాపారులు టన్ను మామిడి ధర రూ.20 నుంచి రూ. 30 వేల వరకు గ్రేడింగ్ ఆధారంగా కొనుగొలు చేసి, మార్కెట్కు తరలిస్తున్నారు.దీంతో ఇక్కడ మామిడికి మంచి డిమాండ్ పలుకుతున్నది.
ఇవి కూడా చదవండి
ఆయుధాలు వీడండి : జమ్ము కశ్మీర్ యువతకు మెహబూబా ముఫ్తీ పిలుపు
ఎక్కువ సిక్స్లు కొట్టారు..మ్యాచ్లు ఓడారు!