ఖమ్మం : సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశానికే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. శనివారం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో లబ్ధిదారులకు జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు చేతుల మీదుగా కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు నిరుపేద కుటుంబాల వారికి వరంగా మారాయన్నారు.
పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్లు ఆ కుటుంబాలకు భారం కావ్వద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. ఈ పథకాలు అమలుతో ఆడపడుచులకు ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దన్నగా మారారన్నారు. ఈ కార్యక్రమంలో మధిర ఏఎంసీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మకమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వరరావు, ఏఎంసీ మాజీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పంబి సాంబశివరావు, తహసీల్దార్ జగదీశ్వరప్రసాద్, ఎంపీడీవో వీ.డీ.వీ.అశోక్, సర్పంచ్ మొగిలి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.