ఏన్కూరు: పేదింటి ఆడపడుచులకు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలు వరంలా మారాయని వైరా ఎమ్మెల్యే రాములునాయక్ అన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఆరుగురు లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతిమండలానికి సుమారు10కోట్లు కళ్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అందించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కుల, మత రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందజేస్తున్నట్లు తెలిపారు. దళితబంధుతో దళితుల గుండెల్లో సీఎం కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలానికి దళితబంధు కింద రూ.5 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బాదావత్ బుజ్జి, తహసీల్దార్ ఖాసీం, ఎంపీడీవో అశోక్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణోతు సురేష్, రైతుబంధు అధ్యక్షుడు మేడా ధర్మారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ భుక్యా లాలునాయక్, నాయకులు పూర్ణకంటి మైసారావు, భుక్యా చందులాల్, చిర్రా రుక్మిణి, ఇంజం శేషగిరిరావు, వాసిరెడ్డి నాగేశ్వరరావు, పఠాన్ మజీద్ఖాన్, చందమామ నరసింహారావు, ఇస్నేపల్లి నాగేశ్వరరావు, భుక్యా బాలాజీ, చింతనబోయిన సీతరాములు, శోభన్నాయక్, భుక్యా శివ, తదితరులు పాల్గొన్నారు.