ఖమ్మం : సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థుల కోసం బీసీ స్టడీ సర్కిల్ హైదరాబాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నది. ఈ నెల 28వ తేదీన సివిల్స్ పరీక్షల్లో విజేతలుగా నిలిచిన వారితో సివిల్స్ పరీక్షలు రాయాలనుకునే అభ్యర్థులను ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం బీసీ స్టడీ సర్కిల్ డైరక్టర్ జీ. శ్రీలత ఓ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి కలిగినవారు ఈ కార్యక్రమంలో పాల్గొనవచ్చని ఆమె సూచించారు.