ఖమ్మం : రెమ్డెసివిర్ వయల్స్ను బ్లాక్ మార్కెటింగ్కు తరలించిన ఘటనలో ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న ఓ స్టాఫ్ నర్సుతో పాటు ఇద్దరు ఔట్సోర్సింగ్ ఉద్యోగులను కలెక్టర్ విధుల నుంచి తొలగించారు. ఈ ఘటన గురువారం చోటుచేసుకుంది. మందులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ ఈ సందర్భంగా హెచ్చరించారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఆస్పత్రుల్లోని వైద్య అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
వైద్యులు అప్రమత్తంగా ఉంటూ రోగులకు అవసరమయ్యే మందులు, ఇంజెక్షన్లు ఇవ్వాలన్నారు. ఈ ప్రక్రియను సూపరింటెండెంట్ పర్యవేక్షించాలని సూచించారు. ఆరు వయల్స్ రెమ్డెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్మార్కెట్లో రూ.38 వేలకు అమ్ముతుండగా టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ వేణు మాధవ్, సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ కుమార్ రైడ్ చేసి రెడ్హ్యాండెడ్గా నిందితులను పట్టుకున్నారు.