మూసాపేట: మండలంలోని చక్రాపూర్ గ్రామంలోని రెండు అంగన్వాడి కేంద్రాలను హెచ్బీఎల్ ఫవర్ సిస్టమ్స్ సంస్థ యజమాన్యం దత్తత తీసుకున్నది. శుక్రవారం ఆ పరిశ్రమ సీఎస్ఆర్ కో-ఆర్డినేటర్ విజయలక్ష్మి, కృష్ణంరాజు, యాదగిరి రెడ్డిలు చక్రాపూర్ గ్రామంలోని అంగన్వాడి కేంద్రం, కనకాపూర్ తండాలోని అంగన్వాడి కేంద్రాలను సందర్శించి, రెండు అంగన్వాడి కేంద్రాలను తమ పరిశ్రమ తరపున దత్తత తీసుకుంటున్నట్లు ప్రకటించారు. దత్తత తీసుకున్న సంస్థకు గ్రామ సర్పంచ్ శైలజాప్రకాష్రెడ్డిలు కృతజ్ఞతలు తెలిపారు