కల్లూరు : తెలంగాణ రాష్ట్రంలో గురుకుల కళాశాలలు, పాఠశాలలను పునఃప్రారంభమయ్యాయి. గురువారం కల్లూరు మండలంలోని వసతిగృహాలు, గురుకుల కళాశాల, పాఠశాలలు తెరుచుకున్నాయి. దీంతో దూరప్రాంతాల నుంచి తల్లిదండ్రులు తమ పిల్లలను వసతిగృహాలకు పంపుతున్నారు. గురువారం నుంచి గురుకుల కళాశాల, పాఠశాలల్లో తరగతులు ప్రారంభం కానుండడంతో విద్యార్ధులు ఉత్సాహంగా తరగతులకు హాజరయ్యారు. ఉపాధ్యాయులు కోవిడ్ నిబంధనలను అనుసరిస్తూ వారిని అనుమతించారు.