ఖమ్మం : జిల్లా వ్యాప్తంగా నిర్వహించనున్న గణేష్ నవరాత్రోత్సవాలకు అవసరమైన విద్యుత్తును వినియోగించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు తాత్కలిక విద్యుత్ కనెక్షన్లకు అనుమతులు తీసుకోవాలని టీఎస్ఎన్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ రమేష్ తెలిపారు. ఈ నెల 10వ తేది నుంచి నిమజ్జనం వరకు గణేష్ మండపాల వద్ద విద్యుత్తు అవసరాలకు తాత్కలిక కనెక్షన్ కోసం స్థానిక విద్యుత్ అధికారులను సంప్రదించాలని అన్నారు.
ఉత్సవాల నిర్వాహకులు నిబంధనలకు విరుద్దంగా విద్యుత్తు తీగలకు కొండీలు తగిలించి అనుమతులు లేకుండా విద్యుత్తును వినియోగించరాదని సూచించారు. మండపాల వద్ద విద్యుత్తు చౌర్యానికి పాల్పడకుండా రుసుము చెల్లించాలని కోరారు. మండపాల వద్ద 1 కిలో వాట్కు-రూ.1500, 1-1.5 కిలో వాట్స్ వరకు రూ.2100, 1.5-2.0 కిలో వాట్స్ వరకు రూ.2800, 2 కిలో వాట్స్కు పై బడిన రూ. 2800తో పాటు ప్రతి కిలో వాట్కు రూ.1500 చొప్పున చెల్లంచాలని సూచించారు.