తల్లాడ: లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఇంజినీర్స్డే వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య పుట్టినరోజు సందర్భంగా పీఆర్ ఏఈ అశోక్, ఇరిగేషన్ డిప్యూటీ ఇంజినీర్ వీ.శ్రీనివాసరావులను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మోక్షగుండం విశ్వేశ్వరయ్య అనేక ప్రాజెక్టులకు డిజైన్ చేసి ఎన్నో ప్రాజెక్టులను కట్టారన్నారు.
ఆయనకు భారతరత్న బిరుదు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్క్లబ్ అధ్యక్షుడు పులబాల వెంకటేశ్వరరావు, లయన్స్క్లబ్ బాధ్యులు మిట్టపల్లి నరసింహారావు, దగ్గుల నారాయణరెడ్డి, నంబూరి కనకదుర్గాప్రసాద్, గుంటుపల్లి వెంకటేశ్వరరావు, దగ్గుల ప్రభాకర్రెడ్డి, పసుమర్తి హరీష్, తదితరులు పాల్గొన్నారు.