ఖమ్మం : జిల్లాలో తమసేమియాతో బాధపడుతున్న వారిని ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకునేందుకు కృషి చేస్తానని జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ అధికారి ఎం.విద్యా చందన అన్నారు. శనివారం నగరంలోని రోటర్ లింబ్ సెంటర్లో సంకల్ప స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో తలసేమియా బాధితులకు ఉచితంగా మందుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి డీఆర్డీవో విద్యాచందన, ఏఆర్ ఏసీపీ విజయబాబు ముఖ్య అతిథులుగా హాజరై వారికి ముందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డీఆర్డీవో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాలు వారికి అందేవిధంగా సహకారం అందిస్తామని తెలిపారు.
ఏసీపీ విజయబాబు మాట్లాడుతూ తలసేమియా పిల్లల కోసం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గత పది సంవత్సరాలుగా రక్తదానం చేసి వారికి అందిస్తున్నామని తెలిపారు. చిన్నారులను అన్ని విధాలుగా ప్రోత్సహించి వారిలో మనోధైర్యం నింపాలని కోరారు. తలసేమియా బాధితులకు సంకల్ప స్వచ్చంద సేవా సంస్థ అందిస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు నారాయణమూర్తి, ఖాదర్బాబా, సంస్థ కోశాధికారి పొద్దుటూరి రవిచందర్, ఉపాధ్యక్షులు పావని, ప్రతినిధులు ప్రభాకర్రావు, ఉదయ్బాస్కర్, అనిత, రాజేష్రెడ్డి, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.