ఖమ్మం : రెండు రోజుల క్రితం తల్లాడ మండలం మద్దునూరి గ్రామ పంచాయతీ పరిధిలో అప్పుడే పుట్టిన శిశువును జిల్లా ఐసీడీఎస్ అధికారులు స్వాదీనం చేసుకున్న సంగతితెలిసిందే. అయితే సదరు శిశువు ఆరోగ్యంపై జిల్లా చైల్డ్వెల్పేర్ కమిటీ చైర్ పర్సన్ జీ.భారతీరాణీ ఆరా తీశారు. గురువారం ఆమె స్వయంగా కమిటీ సభ్యులు దండా లింగయ్య, మాచ్చా అనిత, లక్ష్మయ్యలతో కలిసి ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న శిశువును పరామర్శించారు.
వైద్యం చేస్తున్న డాక్టర్లతో మాట్లాడారు. ప్రస్తుతం శిశువు కండీషన్ గురించి తెలుసుకొని, మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. ప్రస్తుతం శిశువు ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. శిశువుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవాలని జిల్లా సంక్షేమ అధికారిని సీహెచ్ సంద్యారాణీని ఆదేశించడం జరిగిందన్నారు.