ఖమ్మం : సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర డీజీపీ మహేందర్రెడ్డి ఖమ్మంలో పర్యటిస్తున్నారు. ఈ నెల 18న అడ్డగూడూరు పోలీసుస్టేషన్లో మరియమ్మ అనే దళిత మహిళ మృతిచెందింది. మరియమ్మ మరణానికి గల కారణాలను డీజీపీ ఆరా తీస్తున్నారు. ఖమ్మంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మరియమ్మ కుమారుడిని డీజీపీ పరామర్శించారు. ఈ సందర్భంగా మరియమ్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాసేపట్లో మరియమ్మ మృతి ఘటనపై డీజీపీ మీడియాతో మాట్లాడనున్నారు.
మరియమ్మ లాకప్ డెత్పై ప్రతిపక్ష కాంగ్రెస్ నేతలు సీఎం కేసీఆర్ను కలిసి విన్నవించగా ఈ చర్యకు కారణమైన పోలీసులపై విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా డీజీపీని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించబోదని సీఎం పేర్కొన్నారు. మరియమ్మ కుమారుడు ఉదయ్కి ప్రభుత్వ ఉద్యోగం, గృహంతో పాటు రూ. 15 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. అలాగే మరియమ్మ ఇద్దరు కుమార్తెలకు చెరో రూ. 10 లక్షలు ఇవ్వాలని సీఎస్కు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలసిందే.