ఎర్రుపాలెం: తెలంగాణ చిన్న తిరుపతిగా పేరుగాంచిన జమలాపురం శ్రీవేంకటేశ్వరస్వామి దేవాలయంలో శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా గురువారం అమ్మవారు మహిషాసురమర్ధిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఛండీయాగంలో పాల్గొన్న భక్తులతో హోమం వద్ద పూజలు జరిపారు. భక్తులకు ఈసందర్భంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపక ధర్మకర్త యు.కృష్ణమోహన్శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు యు.శ్రీనివాస్, ఆలయ సూపరిండెంట్ బీ.శ్రీనివాస్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.