హైదరాబాద్ : ఖమ్మం నగరపాలికలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అధికారులకు సూచించారు. ఖమ్మంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై పురపాలక ముఖ్య కార్యదర్శి అర్వింద్ కుమార్తోపాటు కలెక్టర్ కర్ణన్, మేయర్ నీరజ, అధికారుతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. నగరంలో సుడా నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. గోళ్లపాడు ఛానల్, సీఎం హామీలు, మిషన్ భగీరథ పనులతోపాటు వెజ్-నాన్వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాల్లో అదనపు వసతులపై అధికారులతో మంత్రి చర్చించారు. అభివృద్ధి పనుల్లో జాప్యం జరుగుతుండటం పట్ల ఆయన అసహనం వ్యక్తం చేశారు. పనులు వేగంగా చేయకపోతే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి.