బోనకల్లు: రాష్ట్రంలో నాలుగు నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ దళితబంధు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేశారు. ఈ నాలుగు నియోజకవర్గాల్లో ఖమ్మం జిల్లాలోని మధిర నియోజకవర్గాన్ని ఎంపిక చేస్తూ, అందులో ముందుగా చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల నియోజకవర్గంలోని 5 మండలాల్లో టీఆర్ఎస్ పార్టీ, దళితసంఘాల నేతల ఆధ్వర్యంలో బుధవారం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
దీనిలో భాగంగా బోనకల్లు మండల కేంద్రంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, దళితసంఘ నేతలు గద్దల వెంకటేశ్వర్లు, కిన్నెర పాపారావు, చిలకా వెంకటేశ్వర్లు, మండల రైతుకన్వీనర్ వేమూరి ప్రసాద్ పాలాభిషేకం చేసి, బాణాసంచా కాల్చి ప్రదర్శన నిర్వహించి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి చేబ్రోలు మల్లికార్జునరావు, మండల ఉపాధ్యక్షులు ఇటికాల శ్రీనివాసరావు, సర్పంచ్లు కొమ్మినేని ఉపేందర్, ఎస్సీసెల్ నాయకులు వెంగళ కనకయ్య, పిల్లెం వెంకటేశ్వర్లు, ఉసికెల సురేష్, రెడ్డబోయిన ఉద్దండు, బొగ్గుల నరసింహారావు, యనమద్ది శ్రీనివాసరావు, గద్దల దావీదు, షేక్ నజీర్, తదితరులు పాల్గొన్నారు.