ఖమ్మం : అధిక వర్షాల కారణంగా పత్తి, వరితో పాటు మిర్చీపంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని వైరా కృషి విజ్ఞాన కేంద్రం కో-ఆర్డినేటర్ డా.హేమంత్కుమార్ అన్నారు. సకాలంలో సస్యరక్షణ చర్యలు తీసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందవచ్చని ఆయన సూచించారు. ఈ సందర్బంగా రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి ఆయన వివరించారు. సాధారణ వర్షపాతం160.7 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు 285.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని హేమంత్కుమార్ తెలిపారు.