ఖమ్మం : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆపద్బాంధవుడని జడ్పీచైర్మన్ లింగాల కమల్ రాజు అన్నారు. మండల కేంద్రంఎర్రుపాలెం రైతువేదికలో సీఎంరిలీఫ్ఫండ్కు దరఖాస్తు చేసుకున్న15 మంది లబ్ధిదారులకు రూ.4.68 లక్షలు విలువ చేసే చెక్కులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అధికారం చేపట్టిన అనతికాలంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో పరుగులు తీయిస్తున్నారన్నారు.
వంద సంవత్సరాల చరిత్ర ఉందని చెప్పుకునే పార్టీలు ప్రవేశపెట్టలేని సంక్షేమ పథకాలను కేసీఆర్ సమర్థవంతంగా అమలు చేస్తున్నారన్నారు. దళితబంధు పథకాన్ని కూడా రాష్ట్ర వ్యాప్తంగా పూర్తిస్థాయిలో అమలు చేయడం జరుగుతుందన్నారు. దళితబంధు పైలెట్ ప్రాజెక్టుగా మధిర నియోకజవర్గాన్ని ఎంపిక చేసినందుకు నియోజకవర్గ ప్రజలందరి తరపున సీఎం కేసీఆర్కు మరోసారి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఎంపీపీ దేవరకొండ శిరీష, జడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్ మొగిలి అప్పారావు, ఎంపీటీసీ మస్తాన్వలీ, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శేగిరెడ్డి శ్రీకాంత్రెడ్డి, రైతుబంధు సమితి మండల కన్వీనర్ శీలం వెంకట్రామిరెడ్డి, నాయకులు బొర్రా వెంకటనారాయణ, సాంబశివరావు, పురుషోత్తంరాజు, మధుసూదన్రెడ్డి, ప్రశాంత్, పలుగ్రామాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.