చింతకాని: మండల పరిధిలోని రామకృష్ణాపురం గ్రామానికి చెందిన నల్లగొండ మహాలక్ష్మికి మధిర ఎమ్మేల్యే మల్లు భట్టి విక్రమార్క సిఫారసు మేరకు ముఖ్యమంత్రి సహయ నిధి ద్వారా మంజూరి అయిన రూ.30వేల చెక్కును కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు అంబటి వెంకటేశ్వరరావు గురువారం అందజేశారు. ఈ సందర్బంగా లబ్దిదారు ముఖ్యమంత్రి కేసీఆర్కు, చెక్కు అందించడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నెబోయిన గోపి, మాజీ సర్పంచ్ తిరుపతి గోవిందరావు,తిరుపతి యాదయ్య,తూము కోటేశ్వరరావు, లబ్దిదారులు పాల్గొన్నారు.