ఎర్రుపాలెం: టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామా నాగేశ్వరరావు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. మండలంలో లబ్దిదారులకు మంజూరైన చెక్కులను శనివారం ఖమ్మంలోని ఎంపీ క్యాంపు కార్యాలయంలో నామా నాగేశ్వరరావు, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు చేతుల మీదుగా పంపిణీ చేశారు. మండలంలోని అయ్యవారిగూడెం, బుచ్చిరెడ్డిపాలెం, జమలాపురం, కొత్తపాలెం, పెద్దగోపవరం, రేమిడిచర్ల, ఎర్రుపాలెం గ్రామాలకు చెందిన మొత్తం 15 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్బంగా లబ్దిదారులు ఎంపీ నామాకు, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, మాజీఏఎంసీ చైర్మన్ చావా రామకృష్ణ, ఎంపీపీ దేవరకొండ శిరీష, సర్పంచ్లు మొగిలి అప్పారావు, పుల్లారెడ్డి, యరమల రేణుక, మూల్పూరి శ్రీనివాసరావు, కృష్ణారెడ్డి, హరిశివ, వెంకటనారాయణ, చిరంజీవి, నాగేశ్వరరావు, కాళేశ్వరరావు, చంద్రశేఖర్రెడ్డి, నారాయణరెడ్డి, లబ్దిదారులు పాల్గొన్నారు.