చింతకాని : ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు సిఫారసు మేరకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కును మండల పార్టీ నాయకులు జగన్నాథపురం గ్రామంలో చిర్రా వెంకటనారాయణకు అందించారు. ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతూ నిరుపేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిఒక్కపేదవారికి సాయం చేయాలన్న ఉద్దేశ్యంతో సీఎంఆర్ఎఫ్అమలు చేస్తున్నారని అన్నారు.
చెక్కు అందించిన వారిలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యాల పుల్లయ్య, సర్పంచ్ ఆలస్యం నాగయ్య, ఎంపీపీ కోపూరి పూర్ణయ్య, రైతుబంధుసమితి జిల్లా సభ్యులు మంకెన రమేశ్, నాయకులు కోలేటి సూర్యప్రకాశ్, రాధాకృష్ణ, కోపూరి రవి తదితరులు పాల్గొన్నారు.