ఖమ్మం :ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, అప్పుడే జన్మించిన శిశువు నుంచి వృద్దుల వరకు అన్ని వర్గాల ప్రజల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్దవహిస్తున్నారని ఖమ్మంనగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్కుమార్లు అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని 48వ డివిజన్ పరిధిలో ఏర్పాటు చేసిన శ్రీమంతం, అక్షరభ్యాసం కార్యక్రమాలలో వారు ముఖ్యఅతిదులుగా పాల్గొని మాట్లాడారు.
దేశంలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే గర్భిణీలకు శ్రీమంతం నిర్వహిస్తున్నారని, దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ తోట గోవింధమ్మ, టిఆర్ఎస్ కార్యాలయ ఇన్ఛార్జి ఆర్జేసి కృష్ణ,సుడా డైరెక్టర్ కొల్లు పద్మ, విద్యార్ధి విభాగం అధ్యక్షులు బాజీబాబ, ఖమ్మం అర్బన్ సీడీపీఓ కవిత, సెక్టర్ సూపర్వైజర్ సత్యశీల, టిఆర్ఎస్ నాయకులు తోట రామారావు, అంగన్వాడీ టీచర్లు సుధారాణి, రమ, భార్గవి, ప్రవీన తదితరులు పాల్గొన్నారు.