ఖమ్మం : ఖమ్మంలోని ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఏడుగురు విద్యార్థులు క్యాంపస్ ప్లేస్మెంట్స్లో సాప్ట్వేర్ ఉద్యోగాలు సాధించినట్లు ఎస్బీఐటీ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ గుండాల కృష్ణ తెలిపారు. కాగ్నిజెంట్ సంస్ధ నిర్వహించిన క్యాంపస్ ప్లేస్ మెంట్స్ లో జెన్సీ డెవలపర్ ఉద్యోగాలకు వివిధ దశల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు.
2020-21 విద్యాసంవత్సరంలో ఇన్పోసిస్లో 14మంది, ఎక్సెంచర్లో 13మంది, టీసీఎస్లో 9మంది, విప్రోలో 7గురు, క్యాప్జెమినిలో 6గురు విద్యార్థులు ఉద్యోగాలు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ డాక్టర్ గుండాల ధాత్రి, ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.