ఏన్కూరు: సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ బీ. అశోక్ అన్నారు. శుక్రవారం ఆరికాయలపాడు, రేపల్లెవాడ గ్రామాల్లో డ్రైడే- ఫ్రైడే కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగ్యూ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ జాగ్రత్తగా ఉండాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు, గాబులు, టైర్లు, డ్రమ్ములు, కుండీల్లో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తొలగించుకోవాలని ఆయన సూచించారు.
మురికిగుంతల్లో ఆయిల్బాల్స్ వేస్తూ దోమల నివారణకు వారానికి ఒకసారి ఫాగింగ్ చేయాలని పంచాయతీ సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు ఇంజం శేషగిరిరావు, విజయకుమార్, పంచాయతీ సిబ్బంది, ఏఎన్ఎంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు.