ఈ వేసవిని ఆహ్లాదంగా గడపడానికి నగరం నుంచి అనేక పర్యాటక ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. వీకెండ్ ఆఫర్లు, ఆలయ సందర్శన, ఒక్కరోజు జర్నీ, పుష్కరాలు, ఇతర రాష్ర్టాల ప్రసిద్ధి చెందిన ప్రాంతాల సందర్శన ఇలా అనేక రకాల ఆఫర్లు పర్యాటకులకు సిద్ధంగా ఉన్నాయి. నగరవాసులు కుటుంబ సమేతంగా వెళ్లేందుకు లగ్జరీ బస్సులు అద్దెకు ఇస్తున్నారు. అంతేకాదు సందర్శించాలనుకున్న ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న రిసార్ట్స్, హోటల్స్, రెస్టారెంట్ల వివరాలనూ పర్యాటక శాఖ వెల్లడించింది.
– సిటీబ్యూరో, ఏప్రిల్ 21 ( నమస్తే తెలంగాణ )
లగ్జరీ ప్రయాణానికి టూరిజం అధికారులు క్యారవాన్ వాహన సేవలను తీసుకొచ్చారు. అందులోనే సోఫా, బెడ్, టాయిలెట్, రిఫ్రిజిలేటర్, 2ఎల్ఈడీ స్క్రీన్స్ ఉంటాయి. 80 కిలోమీటర్లకు గాను 8 గంటలకు రూ.4వేలు, 12 గంటలకు రూ.6 వేలు ఉంటుంది. ప్రతి అదనపు కిలో మీటర్కు రూ.35 ఉంటుంది. దీంతో పాటు 15 సీట్లు, 18 సీట్లు, 26 సీట్లు గల బస్సులు అద్దెకు ఉన్నాయి.
1. తిరుపతి, తిరుమల, తిరుచానూర్ యాత్ర మూడు రోజులు ఉంటుంది. ఓల్వో బస్సు ప్రతీ రోజు సా. 5:30గంటలకు ప్రారంభమై మరుసటి రోజు ఉ. 6గంటలకు చేరుకుంటుంది. శీఘ్రదర్శనం ఉంటుంది. చిన్నారులకు టికెట్ ధర రూ.2880, పెద్దలకు రూ. 3,600.
2. ప్రతీ శుక్ర, శనివారం ఓల్వాకోచ్లో నాలుగు రోజుల యాత్ర ప్యాకేజీ ఉంది. తిరుమల, తిరుచానూర్, శ్రీకాళహస్తి, కాణిపాకం, శ్రీనివాస మంగపురం, కపిలతీర్థంను సందర్శించొచ్చు. దీనికి పెద్దలకు రూ.3,900, చిన్నారులకు రూ. 3,120.
ప్రతీనెల ఒకటో తేదీన 14 రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. బెంగళూరు, శ్రీరంగపట్నం, మైసూర్, శ్రావణబెళగొళ, హలేబిడ్, బేలూరు, గురవాయూర్, కొచ్చి, తిరువనంతపురం, సుచింద్రం, కన్యాకుమారి, మధురై, రామేశ్వరం, తంజావూర్, కుంభకోణం, పాండిచ్చేరి, మహాబలిపురం, కంచి, స్టార్ టెంపుల్, తిరుతడి, తిరుపతి తదితర ప్రాంతాలన్నీ సందర్శించే అవకాశం ఉంది. వసతి కల్పిస్తారు. టికెట్ ధర పెద్దలకు రూ.29వేలు, చిన్నారులకు రూ. 23,200.
ఈ యాత్రకు స్పైస్ జెట్, ట్రూ జెట్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఉదయం 6:55కు బయలుదేరితే అదే రోజు సా.6:30కి తిరిగివస్తారు. టికెట్ ధర ఒక్కరికి రూ. 11,499. ఒకరోజు, రెండు రోజుల ప్యాకేజీ అందుబాటులో ఉంది. ఏసీ సదుపాయం, లంచ్, శీఘ్రదర్శనం అందిస్తారు. రెండు రోజుల యాత్రకు టికెట్ ధర రూ. 14,499 ఉంటుంది. ట్రూజెట్ ధరలు కూడా ఇదే తరహాలు ఉన్నాయి.
ప్రతీ గురువారం అరకుకు నాలుగు రోజుల యాత్ర ఉంటుంది. రాత్రి 7 గంటలకు ప్రారంభమై ఆ మరుసటిరోజు ఉదయం 7 గంటలకు చేరుకుంటుంది. అన్నవరం, సింహాచలం, వైజాగ్, బోటింగ్, ఆర్కే బీచ్, మ్యూజియం, కైలాసగిరి, అరకు, బొర్ర గుహలు, అనంతగిరి ప్రాంతాలను చుట్టిరావొచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.5999, చిన్నారులకు రూ.4799.
ఇది రెండు రోజుల టూర్. ప్రతి శనివారం రాత్రి 8గంటలకు ప్రారంభమవుతుంది. విజయవాడ, సూర్యలంక్ బీచ్ సందర్శించొచ్చు. వసతి కల్పిస్తారు. టికెట్ ధర పెద్దలకు రూ.3000, చిన్నారులకు రూ.2400
ప్రతి వారాంతంలో రాత్రి 8 గంటలకు ఏసీ బస్సులో నాలుగు రోజుల ట్రిప్ ఉం టుంది. బెంగళూరు, ఇస్కాన్ టెంపుల్, విశ్వేశ్వరయ్య మ్యూజియం, టిప్పు ప్యాలెస్, ఊటీ, కూర్గ్ తదితర ప్రాంతాలను సందర్శించొచ్చు. టెకెట్ ధర పెద్దలకు రూ.10,999, చిన్నారులకు రూ.8799 ఉంటుంది.
ప్రతి రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు 5 రోజుల యాత్ర. ఏసీ బస్సులో ప్రయాణం. సౌత్గోవా, నార్త్ గోవా, సాంటామోనికా తదితర ప్రాంతాలన్నీ చూడొచ్చు. టికెట్ ధర పెద్దలకు రూ.7900, చిన్నారులకు 6,320.
ప్రతీ బుధవారం 4 రోజుల యాత్ర ప్రారంభమవుతుంది. షిర్డీ, శనిసింగణాపూర్, అజంతా, ఎల్లోరా, ఘృశ్నేశ్వర్, ఔరంగాబాద్ ప్రాంతాలను తిలకించొచ్చు. దీనికి ఏసీ, నాన్ ఏసీ బస్సు సౌకర్యం ఉంది. ఏసీ అయితే పెద్దలకు రూ.2800, చిన్నారులకు 2650.
ఇది రెండు రోజుల ప్యాకేజి. సాక్షిగణపతి, మల్లికార్జునస్వామి, పాతాళగంగ, పాలధార, పంచధార, శిఖరం, డ్యామ్ ప్రాంతాలను కవర్ చేస్తుంది. ప్రతీ రోజు ఉదయం పది గంటలకు బస్సు బయలుదేరుతుంది. ఏసీ కోచ్ అయితే పెద్దలకు రూ.2250, చిన్నారులకు రూ.1800. నాన్ ఏసీ అయితే పెద్దలకు రూ.1800, చిన్నారులకు రూ. 1440.
శ్రీశైలం, అహోబిలం, మహానంది, యాగంటి, అలంపూర్ ప్రాంతాలను సందర్శించడానికి ప్యాకేజీ ప్రతీ శుక్రవారం ఉంది. నాన్ ఏసీ కోచ్ పెద్దలకు రూ.4000, చిన్నారులకు రూ.3,200.
టోల్ ఫ్రీ -180042546464
బషీర్బాగ్ -040-29801039
పర్యాటకభవన్ -040-23414334
శిల్పారామం -040-29559039
కూకట్పల్లి -040-29556146
సికింద్రాబాద్ -040-29555850