ఖమ్మం : భద్రాద్రి జిల్లాలో బీభత్సం సృష్టించిన గోదారి వరదతో సర్వం కోల్పోయిన భద్రాచలం ప్రాంత బాధితులకు సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అండగా నిలిచారు. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమంలో భాగంగా..వర్ష ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి నిత్యావసర సరుకులు, వంట పాత్రలు పంపిణీ చేశారు.
పశుగ్రాసం లేక అలమటిస్తున్న మూగజీవాల ఆకలి తీర్చారు. భద్రాచలంలోని గోశాలలకు 40 ట్రాక్టర్ల పశుగ్రాసాన్ని అందించారు. భద్రాచలంలో సీతారాములను దర్శించుకుని గోశాలలో పూజ నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ తాతా మధు, మాజీ ఎమ్మెల్సీ బాలసాల లక్ష్మీనారాయణ ఐటీడీఏ పీవో పోట్రు గౌతం, తదితరులు పాల్గొన్నారు.