టేకులపల్లి, అక్టోబర్ 4: పేదలకు సీఎం సహాయ నిధి భరోసా ఇస్తున్నదని ఇల్లెందు ఏఎంసీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్ అన్నారు. మండలంలోని గొళ్లపల్లి పంచాయతీకి చెందిన పొగాకు జయలక్ష్మి అనారోగ్యంతో బాధపడుతున్నది. ప్రస్తుతం తలకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పడంతో పేదరికంలో ఉన్న తమను ఆదుకోవాలని స్థానిక టీఆర్ఎస్ నాయకుల సహకారంతో ఎమ్మెల్యే హరిప్రియ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే వెంటనే రూ.2.50లక్షల ఎల్వోసీ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్ బాధితురాలి భర్త రామయ్యకు అందజేశారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొమ్మెర్ల వరప్రసాద్గౌడ్, నాయకులు కంభంపాటి చంద్రశేఖర్రావు, చీమల సత్యనారాయణ, ఇస్లావత్ బాలూనాయక్, బర్మావత్ శివకృష్ణ పాల్గొన్నారు.
మండల అభివృద్ధికి ఎమ్మెల్యే కృషి
ఎమ్మెల్యే హరిప్రియ కృషితో మండలాన్ని అభివృద్ధి చేస్తామని ఇల్లెందు మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని బోడు రోడ్డు సెంటర్లో నూతనంగా నిర్మించిన రోడ్డు మధ్యలోని డివైడర్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. సర్పంచ్ బోడ సరిత, కోఆప్షన్ సభ్యుడు మౌలనా, వార్డు సభ్యులు నోముల భానుచందర్, పంచాయతీ కార్యదర్శి కిరణ్, నాయకుడు గుడిపూడి మోహన్రావు పాల్గొన్నారు.
ఘనంగా బోనాల పండుగ
ఇల్లెందు రూరల్, అక్టోబర్ 4: మండలంలోని నిజాంపేట గ్రామాంలో మంగళవారం బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోత్ హరిసింగ్నాయక్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆంనతరం కట్టుగూడెం, రేపల్లెవాడ, నిజాంపేట గ్రామస్తులతో కలిసి మైసమ్మ తల్లి ఆలయానికి శోభాయాత్రగా బయలుదేరి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా హరిసింగ్నాయక్ మాట్లాడుతూ.. ప్రజలను చల్లగా చూడాలని అమ్మవారిని వేడుకున్నటు ్లతెలిపారు. ఆలయ కమిటీ చైర్మన్ సువర్ణపాక శోభన్, సర్పంచ్ ఆలెం కౌసల్య, ఎంపీటీసీ పూణెం లింగమ్మ, బానోత్ వెంకటేశ్, నాయకులు గాజుల వెంకన్న, బింగి కృష్ణ, బట్టు లింగన్న, సమ్మయ్య, రాము లు, స్వామీ, ముసలయ్య, సైదులు పాల్గొన్నారు.