బతుకమ్మ పండుగకు తల్లాడ, అక్టోబర్ 2: స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే బతుకమ్మ పండుగకు అంతర్జాతీయ గుర్తింపు లభించిందని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన బతుకమ్మ సంబురాల్లో ఆయన మాట్లాడారు. బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కోటి మంది మహిళలకు చీరెలు పంపిణీ చేసిందన్నారు. అన్ని మతాలను గౌరవిస్తూ లౌకిక విలువలను కాపాడుతున్నదన్నారు. భిన్నత్వంలో ఏకత్వానికి తెలంగాణనే నిదర్శనమన్నారు. సీపీ విష్ణు ఎస్ వారియర్ మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ స్ఫూర్తి ప్రపంచానికే ఆదర్శమన్నారు. అన్నివర్గాల ప్రజలను ఏకం చేసే ఇలాంటి పండుగ దేశంలో మరెక్కడా లేదన్నారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు మాట్లాడుతూ.. ప్రకృతినే దేవతగా పూజించే పూల పండుగ బతుకమ్మ అని అన్నారు. అనంతరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి నారాయణపురంలోని లూర్దుమాత పాఠశాల వరకు ర్యాలీ కొనసాగింది. కార్యక్రమంలో డీసీఎంఎస్ చైర్మన్ రాయల వెంకటశేషగిరిరావు, రైతుబంధు సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ దొడ్డా శ్రీనివాసరావు, జడ్పీటీసీ దిరిశాల ప్రమీల, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రెడ్డెం వీరమోహన్రెడ్డి, రైతుబంధు సమితి మండల కో-ఆర్డినేటర్ దుగ్గిదేవర వెంకట్లాల్, ఆత్మ చైర్మన్ హరికృష్ణారెడ్డి, వైరా ఏసీపీ రెహమాన్, ఏఎంసీ వైస్ చైర్మన్ దూపాటి భద్రరాజు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అఫ్జల్ హసన్, కుర్నవల్లి సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్రెడ్డి, ఎంపీవో కొండపల్లి శ్రీదేవి, సర్పంచ్లు శీలం కోటారెడ్డి, పొట్టేటి సంధ్యారాణి, దిరిశాల దాసురావు, గరిడేపల్లి వెంకటేశ్వర్లు, దగ్గుల శ్రీనివాసరెడ్డి, దగ్గుల రాజశేఖర్రెడ్డి, అయిలూరి లక్ష్మి, ఓబుల సీతారామిరెడ్డి, వరపర్ల ఉమాఉదయ్, బద్ధం నిర్మల, తూము శ్రీనివాసరావు పాల్గొన్నారు.