మధిర: తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు ఆజాది కా అమృత్ మహోత్సవాల్లో భాగంగా బుధవారం మధిర మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఆవరణలో మధిర కోర్టు న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్, జూనియర్ సివిల్ జడ్జి డీ.ధీరజ్కుమార్ ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన, అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జడ్జి ధీరజ్కుమార్ మాట్లాడుతూ బలహీన వర్గాలు, పేదలు, వృద్ధులు, మహిళలు న్యాయసేవాధికార సంస్థ ద్వారా వారికి లభించే న్యాయ సేవలను ఉపయోగించుకోవాలని తెలిపారు.
న్యాయస్థానం ముందు పేద, ధనిక తారతమ్యాలు లేవన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు భైరవభట్ల శ్రీనివాసరావు, సీనియర్ న్యాయవాదులు వాసంశెట్టి కోటేశ్వరరావు, డీ.జగన్మోహన్రావు, డీ.సుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు.