భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలు ఇచ్చారు. కేంద్ర స్థాయి, రాష్ట్ర స్థాయి , జిల్లా స్థాయి, తాలూకా స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి వృద్ధులకు ప్రభుత్వం ఇస్తున్న రాయితీల గురించి, ఆరోగ్య సమస్యలు, సామాజిక భద్రత, పోలీసుల సహకారం మొదలైన అంశాలను చక్కగా వివరించారు.
అనంతరం న్యాయమూర్తిని ఘనంగా సత్కరించారు. ఈ సదస్సులో సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎంవీఎస్ఎస్ నారాయణ, అధ్యక్షులు బందు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు చల్లగుళ్ల నాగేశ్వరరావు, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు కే. శంకర్సింగ్, విశ్రాంత ఉపాధ్యాయులు గ్రంథి సత్యనారాయణ, కార్యదర్శి ప్రసాద్, మంగయ్య, కృష్ణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.