బోనకల్లు :నిఘా నేత్రాలుగా సీసీకెమెరాలు దోమదపడతాయని వైరా ఏసీపీ సత్యనారాయణ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద సీసీకెమెరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో సీసీకెమెరాలు పోలీసు వ్యవస్థకు, ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయన్నారు.
ఈ కెమెరాల ద్వారా కొత్త వ్యక్తులు, అనుమానిత వ్యక్తులను గుర్తించడానికి సీసీకెమెరాలు ఉపయోగపడుతాయన్నారు. ప్రధాన కూడళ్లలో ఈ కెమెరాలు ఏర్పాటు చేసేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మధిర సీఐ మురళీ, బోనకల్లు సర్పంచ్ భూక్యా సైదానాయక్ , ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ, ఏఎస్సై వెంకటనారాయణ, తదితరులు పాల్గొన్నారు.