ఖమ్మం : ఖమ్మం జిల్లాలో అర్హత కలిగిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగుల విద్యార్థులు 2021-2022 విద్యా సంవవత్సరానికి పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా ఎస్సీ అభివృద్దిశాఖ డీడీ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అర్హత ఉన్న విద్యార్థులు ఈ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు.
విద్యార్థులు ఈ-పాస్ వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 24వ తేదీ వరకు గడువు ఉందని పేర్కొన్నారు. కళాశాల స్థాయిలో పెండింగ్లో ఉన్న 2020-21 విద్యా సంవత్సరానికి ఉపకార వేతనాలకు సంబంధించిన హార్డ్ కాపీలను వెంటనే జిల్లా కార్యాలయంలో అందజేయాలని పేర్కొన్నారు.