ఎర్రుపాలెం: ఖమ్మం జిల్లాలో మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని దళితబంధు పథకానికి ఎంపిక చేయడం పట్ల ఎంపీపీ దేవరకొండ శిరీష ఆధ్వర్యంలో స్థానిక రింగ్రోడ్డు సెంటర్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి బుధవారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చింతకాని మండలాన్ని దళితబంధు పథకం అమలు కోసం ఎంపిక చేయడానికి కృషి చేసిన మంత్రి పువ్వాడ అజయ్కుమార్, జడ్పీచైర్మన్ లింగాల కమలరాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావులకు ఎర్రుపాలెం మండల టీఆర్ఎస్ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, ఏఎంసీ మాజీచైర్మన్ చావా రామకృష్ణ, జడ్పీటీసీ శీలం కవిత, సర్పంచ్ అప్పారావు, ఎంపీటీసీ షేక్ మస్తాన్వలీ, పెద్దగోపవరం సర్పంచ్ శివాజీ, ఎంపీటీసీ కిషోర్, టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి నారాయణ, వివిధ గ్రామాల టీఆర్ఎస్ నాయకులు, దళిత సంఘ నాయకులు పాల్గొన్నారు.