ఖమ్మం : దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా
జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు.
మండల పరిధిలో మత్కేపల్లి నామవరం గ్రామ దళిత కాలనీలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కమల్ రాజు పాల్గొని మాటాడారు. దళితుల సాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, దళితబంధు కార్యక్రమం దేశానికే దిక్సూచిలా నిలువనున్నదని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి కోండలరావు, ఉపసర్పంచ్ దేవరగట్ల సునిత, గ్రామశాఖ నాయకులు, వార్డుసభ్యులు, దళిత సంఘాల నాయకులు, దళితులు పాల్గొన్నారు.