చింతకాని: దళితబంధు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా మధిర నియోజకవర్గంలో చింతకాని మండలాన్ని ఎంపిక చేయడం పట్ల జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజ్ స్ధానిక దళితులు, దళితసంఘాల నాయకులతో కలసి తెలంగాణ సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. మండల పరిధిలో రైల్వేకాలని గ్రామ దళిత కాలనీలో దళిత సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆయన మాటాడారు.
దళితుల సాధికారిత సీఎం కేసీఆర్తోనే సాధ్యమని, దేశానికే దిక్సూచిలా దళితబంధు కార్యక్రమం నిలువనున్నదని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పరిటాల యలమంద, ఉపసర్పంచ్ సునిత, గ్రామశాఖ నాయకులు, వార్డుసభ్యులు, దళిత సంఘాల నాయకులు, దళితులు పాల్గొన్నారు.