వైరా : అనాథలు, అభాగ్యులకు ఆశ్రయం కల్పిస్తున్న అన్నం సేవాఫౌండేషన్ నిర్వాహకులు అన్నం శ్రీనివాసరావును ఐద్వా వైరా మున్సిపాలిటీ కార్యదర్శి గుడిమెట్ల రజిని ఘనంగా సన్మానించారు. రజిని తన పుట్టినరోజు వేడుకలను ఖమ్మంలోని అన్నం ఫౌండేషన్లోని అనాథలతోకలిసి జరుపుకున్నారు. ఈ సందర్భంగా అన్నం ఫౌండేషన్లోని అనాథలకు పండ్లు పంపిణీ చేశారు.
అనంతరం ఎందరో అభాగ్యులకు నిర్విరామంగా సేవ చేయడంతో పాటు, కరోనాతో మృతిచెందినవేలాదిమందికి అంత్యంక్రియలు నిర్వహించిన అన్నం శ్రీనివాసరావును ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గుడిమెట్ల వెంకటరోహన్, అనుమోలు సైదులు తదితరులు పాల్గొన్నారు.