బోనకల్లు : మండల పరిధిలోని గోవిందాపురం-ఎల్ గ్రామానికి చెందిన అభిజిత్దేవ్కు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఆదివాసీల సామాజిక- ఆర్థిక, జీవన స్థితిగతుల పరిశీలన అనే అంశంపై కాకతీయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ను ప్రదానం చేసింది. అభిజిత్దేవ్కు పర్యవేక్షకుడిగా పీజీ కళాశాల విశ్రాంత ప్రధానాచార్యులు రంగం రాధాకృష్ణ వ్యవహరించారు. ఆయన గీతాంజలి డిగ్రీ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. డాక్టరేట్ పొందిన అభిజిత్దేవ్ను గీతాంజలి డిగ్రీ కళాశాల యాజమాన్యం దొడ్డా శ్రీనివాసరెడ్డి, నెల్లూరి హనుమంతరావు, అధ్యాపకులు, గ్రామస్తులు అభినందించారు.