ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్రాజు
మామిళ్లగూడెం, జూలై 30: చింతకాని, ముదిగొండ మండలాలకు చెందిన రైతుల భూసమస్యలు పరిష్కరించాలని జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్రాజు శుక్రవారం కలెక్టర్ వీపీ గౌతమ్ను కోరారు. ధరణి పోర్టల్ అప్డేట్, రికార్డుల ఆధునీకరణ తర్వాత భూసమస్యలు తలెతత్తాయన్నారు. వాటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలన్నారు. అనంతరం పలువురు రైతులు కలెక్టర్కు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో చింతకాని జడ్పీటీసీ తిరుపతి కిశోర్, ముదిగొండ ఎంపీపీ సామినేని హరిప్రసాద్, టీఆర్ఎస్ నాయకులు రెంట్యాల పుల్లయ్య, పసుపులేటి వెంకట్, ధర్మా, శిలువరాజ్ పాల్గొన్నారు.