లక్ష్మీదేవిపల్లి, మే 29: సీఎం కేసీఆర్ పేదల పక్షపాతి అని, పేదింటి ఆడబిడ్డల పెళ్లి కోసం రూ.లక్ష అందిస్తూ వారిని మరింతగా ఆదుకుంటున్నారని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. మండలంలోని లోతువాగు రైతువేదికలో శనివారం జరిగిన కార్యక్రమంలో లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. మండలంలోని లక్ష్మీదేవిపల్లి, రేగళ్ల, గట్టుమళ్ల, మైలారం, బంగారు చెలక, అనిశెట్టిపల్లి, సీతారాంపురం, కారుకొండ ఉమ్మడి పంచాయతీల్లో 63 మంది లబ్ధిదారులకు సుమారు రూ.63,07,308 విలువైన చెక్కులను అందించారు. టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపీపీ భూక్యా సోనా, తహసీల్దార్ నాగరాజు, ఎంపీటీసీ కొల్లు పద్మ, తరాల రామ్మూర్తి, కో ఆప్షన్ సభ్యుడు జక్కుల సుందర్, సొసైటీ వైస్ చైర్మన్ కూచిపూడి జగన్, డైరెక్టర్లు శేషాద్రి వినోద్, బాలకృష్ణ, సర్పంచ్లు బలరాం, బానోత్ శారద, కిషన్, లాలు, చంద్రశేఖర్, వెంటేశ్వర్లు, ప్రశాంత్, దిశా కమిటీ సభ్యుడు పరంజ్యోతిరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కొట్టి వెంకటేశ్వర్లు, కాసుల వెంకట్, పూనం శ్రీను, వశ్యా నాయక్, రాంకోటి, రాంజీ, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.