ఉమ్మడి జిల్లాలో పది స్థానాలను గెలిపిద్దాం
కార్యకర్తలు పార్టీ ఆదేశాలను పాటించాలి
రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అజయ్కుమార్
అన్ని వర్గాలకు ప్రాధాన్యం: ఎమ్మెల్యే రాములునాయక్
తనికెళ్లలో టీఆర్ఎస్ వైరా నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశం
కొణిజర్ల, సెప్టెంబర్ 26:సమష్టిగా పని చేసి టీఆర్ఎస్ను సంస్థాగతంగా బలోపేతం చేద్దామని, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు గెలిపిద్దామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. కొణిజర్ల మండలం తనికెళ్లలోని శ్రీసిటీలో ఆదివారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. వ్యక్తిగత ఇష్టాయిష్టాలను పక్కన పెట్టి పార్టీ విధానాలకు కట్టుబడి కార్యకర్తలు పనిచేయాలన్నారు.
ఐకమత్యంతో పని చేసి టీఆర్ఎస్ను మరింత బలోపేతం చేద్దామని, వచ్చే సాధారణ ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో పదికి పది ఎమ్మెల్యే స్థానాలు గెలుద్దామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. తనికెళ్లలోని శ్రీసిటీలో ఆదివారం వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల కంటే వైరా నియోజకవర్గంలో కమిటీలు పూర్తి కావడం ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమన్నారు. కమిటీల నియామకంలో ఎమ్మెల్యేదే నిర్ణయమే తుది నిర్ణయమన్నారు. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో టీఆర్ఎస్కు ప్రతికూల వాతావరణం నెలకొందని, కారు గుర్తుపై కేవలం తాను మాత్రమే గెలిచానన్నారు. వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లో టీఆర్ఎస్సే గెలవాలన్నారు. వ్యక్తిగత ఇష్టా ఇష్టాలను పక్కన పెట్టి పార్టీ విధానాలకు కట్టుబడి కార్యకర్తలు పనిచేయాలన్నారు. నియోజకవర్గాన్ని గులాబీ కంచుకోటగా మార్చుకుందామన్నారు. దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టిన ఘనత టీఆర్ఎస్దే అన్నారు. అభివృద్ధి, సంక్షేమాలను చూసి ఓర్వలేక కాంగ్రెస్, బీజేపీలు తప్పుడు విమర్శలకు పాల్పడుతున్నాయన్నారు. కాంగ్రెస్కు సొంత పార్టీలో నాయకులు దొరకక వేరే పార్టీ నుంచి అద్దెకు తీసుకొచ్చి పీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టాల్సిన దుస్థితి నెలకొన్నదన్నారు. ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని వర్గాల సంక్షేమానికి కేసీఆర్ పెద్దపీట వేశారన్నారు.
టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకల నరేశ్రెడ్డి మాట్లాడుతూ.. పార్టీ సంస్థాగత బలోపేతానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు. కలిసి పనిచేసి పార్టీ లక్ష్యాలను సాధించాలని సూచించారు. అనంతరం నియోజకవర్గంలోని ఐదు మండలాలకు చెందిన గ్రామ కమిటీలు, మండల కమిటీల వివరాల నివేదికను రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి అందజేశారు. సమావేశంలో జడ్పీచైర్మన్ లింగాల కమల్రాజు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఎంపీపీలు గోసు మధు, వేల్పుల పావని, మాలోతు శకుంతల, లావుడ్యా సోని, జడ్పీటీసీలు నంబూరి కనకదుర్గ, బాదావత్ బుజ్జి, పోట్ల కవిత, వాంకుడోత్ జగన్, సుడా డైరెక్టర్ కృష్ణ, పార్టీ మండలాల అధ్యక్షులు చిరంజీవి, బాణాల వెంకటేశ్వర్లు, బాణోతు సురేశ్, నరసింహారావు, తోటకూర రాంబాబు, ఏఎంసీ చైర్మన్ గుమ్మా రోశయ్య, వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, ముళ్లపాటి సీతారాములు, ఆత్మ కమిటీ చైర్మన్ ముత్యాల సత్యనారాయణ, టీఆర్ఎస్ నాయకులు పోట్ల శ్రీను, చెరుకుమల్లి రవి, కోసూరి శ్రీను, లేళ్ల అప్పిరెడ్డి, అనుబంధ సంఘాల తదితరులు పాల్గొన్నారు.