కొత్తగూడెం, అక్టోబర్ 24: టీఆర్ఎస్ పార్టీ మరో 20ఏండ్ల వరకు రాష్ట్రంలో అధికారంలో ఉంటుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. ఆదివారం కొత్తగూడెం బస్టాండ్ సెంటర్లోని టీబీజీకేఎస్ కార్పొరేట్ కార్యాలయంలో కొత్తగూడెం పట్టణం, సుజాతనగర్ మండల పార్టీ సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. పార్టీ తర్వాతే మనమని, పార్టీ బాగుంటేనే మనం బాగుంటామన్నారు. ప్రజాప్రతినిధులు కూడా పార్టీ పట్ల శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. టీఆర్ఎస్ చేపట్టిన సంక్షేమ పథకాలు దేశంలోనే నంబర్వన్గా నిలిచాయన్నారు. వరంగల్లో వచ్చే నెల 15వ తేదీన భారీ బహిరంగ సభకు నియోజకవర్గం నుంచి పది వేల మంది కార్యకర్తలు తరలిరావాలని కోరారు. ఈ నెల 27న కొత్తగూడెం క్లబ్లో నియోజకవర్గ స్థాయి టీఆర్ఎస్ ఇన్చార్జిలు, కమిటీలు, ప్రజా ప్రతినిధుల సభ ఉంటుందని, దీనికి 108 పంచాయతీలు, 60 మున్సిపల్ వార్డుల నుంచి కార్యకర్తలు, కమిటీ సభ్యులు హాజరుకావాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకుడు వనమా రాఘవేందర్రావు, జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్రావు, మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి, వైస్ చైర్మన్ దామోదర్యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్యా రాంబాబు, సొసైటీ చైర్మన్ మండె వీరహన్మంతరావు, ఉర్దూఘర్ కమిటీ చైర్మన్ అన్వర్పాషా, మండల అధ్యక్షుడు లింగం పిచ్చిరెడ్డి, నాయకులు ఊకంటి గోపాలరావు, కాసుల వెంకట్, ఆళ్ల మురళి, శ్రీధర్, రావి రాంబాబు, కంభంపాటి దుర్గాప్రసాద్, యూసుఫ్, మసూద్, దిశా కమిటీ మెంబర్ పరంజ్యోతిరావు, రైతు బంధు సమితి కమిటీ సభ్యులు భాగం మోహన్రావు, సత్యనారాయణ, కోలాపూరి ధర్మరాజు, ఎంపీపీ భూక్యా విజయలక్ష్మీ, జడ్పీటీసీ బిందు చౌహాన్, ఎంపీటీసీలు మూడ్ గణేష్, కో-ఆప్షన్ మెంబర్లు దూడల బుచ్చయ్య, యాకూబ్, కనుకుంట్ల పార్వతి, మీరాబీ, కౌన్సిలర్లు రుక్మాంగధర్ బండారి, పరమేశ్యాదవ్, అంబుల వేణు, జయంతి మసూద్, కూరపాటి విజయలక్ష్మి, సాహేరా బేగం, మోరె రూప, వనచర్ల విమల, అజ్మీరా సుజాత, పల్లపు లక్ష్మణ్, బండి నర్సింహ, వేముల ప్రసాద్, సర్పంచులు, డైరెక్టర్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.