ద్విదశాబ్ది, ప్లీనరీలను విజయవంతం చేయండి
సమష్టిగా పార్టీని బలోపేతం చేయండి
సన్నాహక సమావేశంలో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు
మణుగూరు రూరల్, అక్టోబర్ 22: టీఆర్ఎస్ ద్విదశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 25వ తేదీన నిర్వహించనున్న పార్టీ ప్లీనరీ సమావేశం, వచ్చే నెల 15న వరంగల్లో జరిగే విజయగర్జన సభను విజయవంతం చేయాలని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు పిలుపునిచ్చారు. శుక్రవారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ముత్యంబాబు అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలన్నారు. పోడు భూముల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. విజయ గర్జన సభకు నియోజకవర్గం నుంచి 10వేల మంది తరలిరావాలన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన పార్టీ గ్రామ, మండల, పట్టణ నూతన కమిటీలకు శుభాకాంక్షలు తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీ పోశం నర్సింహారావు, ఎంపీపీ కారం విజయకుమారి, పీఏసీఎస్ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, వైస్ ఎంపీపీ కేవీరావు, కార్యదర్శి రామిడిరామిరెడ్డి, టీబీజీకేఎస్ నేత సామా శ్రీనివాసరెడ్డి, పార్టీ నాయకులు వట్టం రాంబాబు, తాళ్లపల్లి యాదగిరి గౌడ్, కోఆప్షన్ సభ్యుడు జావీద్పాషా, టీబీజీకేఎస్ నాయకుడు కోటాశ్రీనివాస్ పాల్గొన్నారు.