మహిళా సంఘాలకు సర్కారు వెన్నుదన్ను
ఆరు సీజన్లలో 23,53,669.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు
ఇప్పటికే నాలుగుసీజన్ల కమీషన్ వ రూ.44, 56, 0152.11 విడుదల
కొనుమామిళ్లగూడెం, మే 20 :రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. అన్నదాతల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. అంతేకాకుండా, మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి కల్పించడంతో పాటు ఆర్థిక భరోసా కల్పించేందుకు ధాన్యం కొనుగోళ్లలోనూ వారిని భాగస్వాములను చేస్తున్నది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మహిళా సంఘాల సభ్యులు ఆరు సీజన్లలో 23,53,669.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. ఇప్పటివరకు నాలుగు సీజన్లకు సంబంధించిన కమీషన్ రూ.44.56 కోట్లను విడుదల చేసింది.
గోళ్లతో సంఘాలకూ ఆదాయం మహిళా స్వయం సహాయ సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలుస్తోంది. వివిధ వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పించి ఆర్థికంగా తోడ్పాటునందిస్తున్నది. ఇందులో భాగంగా మహిళా సంఘాల సభ్యులను ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భాగస్వాములను చేసింది. దీని ద్వారా మహిళలకు ఉపాధి కల్పించడంతోపాటు ఆదాయం సమకూర్చుకునే వెసులుబాటు కల్పించింది. అంతేకాదు, రైతుల పంటలు సకాలంలో కొనుగోలు చేసే అవకాశం ఏర్పడింది. జిల్లాలో 2018-19 నుంచి 2020-21 వ్యవసాయ సీజన్ వరకు పండించిన పంటలను రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలతో కొనుగోలు చేయిస్తోంది. దీని ద్వారా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభిస్తున్నది.
జిల్లావ్యాప్తంగా మహిళా సంఘాలు ఆరు సీజన్లలో ధాన్యం కొనుగోలు చేశాయి. అయితే, నాలుగు సీజన్లకు సంబంధించిన కమీషన్ను ప్రభుత్వం విడుదల చేసింది. జిల్లాలో ప్రస్తుతం యాసంగి ధాన్యాన్ని 67 కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తున్నారు. నాలుగు సీజన్లలో 14,45,375.60 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేయగా.. సంఘాలకు కమీషన్ రూపంలో రూ.44.56 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ ఏడాది వానకాలం సీజన్లో సంఘాల ఆధ్వర్యంలో 68 కొనుగోలు కేంద్రాల ద్వారా 5,07,384 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు. దీంతోపాటు ప్రస్తుతం యాసంగి సీజన్లో 67 కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే 3,99,910 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు చేశారు.