ఎదులాపురం, జూలై 9 : మహిళా సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు త్వరితగతిన అందించేలా చర్యలు చేపట్టాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఐకేపీ సిబ్బందిని అదేశించారు. కలెక్టర్ సమావేశ మందిరంలో శుక్రవారం బ్యాంకు లింకేజీ, పట్ట ణ ప్రగతి, డివైడర్ల నిర్మాణాలు, బాల అదాలత్ అం శాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఈ నెల 15వ తేదీలోగా బ్యాంకు లింకేజీ రుణాలు అందేలా ఐకేపీ సిబ్బంది బ్యాంకు మేనేజర్లతో సం ప్రదించి గ్రౌండింగ్ చేయాలన్నారు.
ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసిక అంతానికి 1279 సం ఘాలకు సుమారు రూ.300 కోట్ల రుణాలు మం జూరు లక్ష్యం కాగా.. ఇప్పటి వరకు 371 సంఘాలకు రూ.12.23 కోట్లు మాత్రమే మంజూరు చేశారన్నారు. క్షేత్రస్థాయి అధికారులు బ్యాంక్ మేనేజర్లతో సంప్రదించి వెంటనే లింకేజీ రుణాలు గ్రౌం డింగ్ అయ్యేలా చూడాలని ఆదేశించారు. పట్టణ సుందరీకరణలో భాగంగా తొమ్మిది కిలో మీటర్ల మేర నిర్మిస్తున్న డివైడర్ల పనులు, జంక్షన్ పనులు త్వరలో పూర్తి చేయాలని రోడ్లు, భవనాల శాఖ ఇం జినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ నెల 15న ఉట్నూర్లో నిర్వహించే బాల్ అదాలత్కు వి స్తృత ప్రచారం కల్పించి బాలలకు సంబంధించిన సమస్యలను పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలన్నారు.
గత హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కల్లో చనిపోయిన వాటి స్థానంలో కొత్త వి నాటడం, వంగిపోయిన విద్యుత్ స్తంభాలను గుర్తించడం, లూస్ వైర్లను గుర్తించడం, దళిత బస్తీ కింద దళిత వాడల్లో కావాల్సిన మౌలిక సదుపాయాల కల్పనకు ప్రతిపాదనలు పంపించడం, తాగునీటి సరఫరా, లీకేజీలను గుర్తించడం వంటి అంశాలపై పూర్తి వివరాలను సేకరించి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సూచించారు. ఆయా పనులు పూ ర్తయ్యేలా సంబంధిత మున్సిపల్ అధికారులతో చ ర్చించాలని మున్సిపల్ ప్రత్యేక అధికారులను ఆదేశించారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్, జడ్పీసీఈవో గణపతి, డీఆర్డీ వో కిషన్, డీపీవో శ్రీనివాస్, డీడబ్ల్యూవో మిల్కా, మున్సిపల్ కమిషనర్ శైలజ, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, ఆర్అండ్బీ మున్సిపల్ ఇంజినీర్లు, ప్రత్యేక అధికారులు, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు.