అచ్చంపేట రూరల్, జూన్ 21: ‘యోగా’ సాధన చేయడంతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని సీడీపీవో దమయంతి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా సోమవారం పట్టణంలోని 10వ అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులతో యోగా సాధన చేయించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యోగాను ప్రతిఒక్కరూ సాధన చేయాలని, యోగాతో అనారోగ్య సమస్యలు తొలగిపోయి శ్వాస, గుండె సంబంధిత అవయవాలు చక్కగా పని చేస్తాయన్నారు. అదేవిధంగా కరోనా రాకుండా, ఊపిరితిత్తులు చక్కగా ఆక్సిజన్ను అందిస్తాయన్నారు. కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ బీపాషా, విజయ, మణెమ్మ, టీచర్ సంధ్య తదితరులు ఉన్నారు.
అమ్రాబాద్ మండలంలో..
అమ్రాబాద్, జూన్ 21: ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అమ్రాబాద్, మన్ననూర్ గ్రామాల్లో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో వెంకటరమణ, యువకులు నాగరాజు, వెం కటయ్య, లింగం, చంద్రయ్య, శివకుమార్ పాల్గొన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
లింగాల, జూన్ 21: యోగాతో మనిషికి ప్రశాంతతతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తున్నదని బీజేపీ మండల అధ్యక్షుడు సలేశ్వరం అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం మండలకేంద్రంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో విష్ణుచారి, తులసీరాం, రాజు, హుస్సేన్ పాల్గొన్నారు.
ఘనంగా యోగా డే
కల్వకుర్తి రూరల్, జూన్ 21: నిత్యం యోగాసనాలు సాధన చేయడంతో దీర్ఘకాలిక రోగాలకు దూరంగా ఉండే అవకాశం ఉందని తెలంగాణ జాగృతి జిల్లాధ్యక్షురాలు మిర్యాల పావని అన్నారు. కల్వకుర్తి పట్టణంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో యోగా గురువు సునంద ఆధ్వర్యంలో ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని సబ్ జైలులో జైలు సూపరింటెండెంట్ బాలకృష్ణ ఆధ్వర్యంలో ఖైదీలు, మండలంలోని గ్రామ పంచాయితీ కార్యాలయాల వద్ద ప్రజాప్రతినిధులు, కార్యదర్శులు యోగాసనాలు వేశారు.
కోడేరు మండలంలో..
కోడేరు, జూన్ 21: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మండలంలోని వివిధ గ్రామాల్లో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఊరగుట్ట సమీపంలో పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలతో ఎంపీడీవో శంకర్నాయక్ యోగా చేయించారు. ఎంపీడీవోతోపాటు సిబ్బంది కూలీలున్నారు.
పెద్దకొత్తపల్లి మండలంలో..
పెద్దకొత్తపల్లి, జూన్ 21: మండలకేంద్రంలోని లిటిల్ బర్డ్ పాఠశాల ఆవరణలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో యోగాసనాలు వేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్రావు, భీమేశ్రెడ్డి, రాజు, లక్ష్మీకాంత్రెడ్డి తదితరులున్నారు.
తిమ్మాజిపేటలో
తిమ్మాజిపేట, జూన్ 21: మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ వద్ద మండల పంచాయతీ అధికారి బ్రహ్మచారి యోగా విశిష్టతను వివరించారు. కార్యక్రమంలో ఎంపీపీ రవీంద్రనాథ్రెడ్డి, జెడ్పీటీసీ దయాకర్రెడ్డి, సర్పంచ్ వేణుగోపాల్గౌడ్, ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ మానిటరింగ్ జిల్లా సభ్యుడు జోగు ప్రదీప్, ఎంపీటీసీ లీలావతి, కోఆప్షన్ సభ్యులు రజాక్, ఇబ్రహీం, సైఫొద్దీన్, సలావుద్దీన్, నవీన్, కార్యదర్శి లక్ష్మీనారాయణ, లింగం పాల్గొన్నారు.
నాగర్కర్నూల్ పట్టణంలో..
నాగర్కర్నూల్, జూన్ 21: జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాల వద్ద బీజేపీ ఆధ్వర్యంలో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజవర్ధన్రెడ్డి, కోశాధికారి వెల్దండ యుగంధర్రావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.