యాదాద్రి భువనరిగి : సీఎం కేసీఆర్ ఈ నెల 21న యాదాద్రి పర్యటనకు వెళ్లనున్నారు. ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం రాత్రి అక్కడే యాదాద్రి అతిథి గృహంలో ఆయన బస చేయనున్నారు. ఈ మేరకు సీఎం పర్యటన ఏర్పాట్లను సీఎంఓ ప్రత్యేక కారదర్శి భూపాల్ రెడ్డి శనివారం పరిశీలించారు. ఆయన వెంట కలెక్టర్ పమేలా సత్పతి, వైటీడీఏ, ఆలయ అధికారులు ఉన్నారు.