హైదరాబాద్ : రాష్ట్రంలో రైతుబంధు పంపిణీ కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకు 42.43 లక్షల మంది రైతుల ఖాతాల్లో నగదును జమ చేశారు. తొలి మూడు రోజుల్లో రైతుబంధు కింద రూ. 1153.50 కోట్లు జమ చేసినట్లు అధికారులు వెల్లడించారు. రేపు మరో 7.05 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి నగదు జమ చేస్తామన్నారు. రేపు 58.85 లక్షల ఎకరాలకు రూ. 2,942.27 కోట్లు జమ చేయనున్నారు. ఎకరానికి రూ. 5 వేల చొప్పున రైతుల ఖాతాల్లోకి ప్రభుత్వం బదిలీ చేస్తున్న సంగతి తెలిసిందే. సంవత్సరానికి రెండుసార్లు రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.